[1].సూర్యునికి ఎదురుగా నిలబడి పండ్లు తోముకోకూడదు.
[2].పురుషులు దీపమును ఆర్పకూడదు.ఒక దీపముతో మరొక దీపమును వెలిగించకూడదు.
[3].వ్రతము చేయువారు మంచము మీద నిద్రించ కూడదు.శృంగారంలో పాల్గొనకూడదు.ఒక పూట పలహారము మాత్రమే బుజిమ్పవలెను.తాను ఆహారము బుజించే ముందు పేదలకు గానీ ,బిక్షువులకు గాని కడుపు నింపవలెను.
[4].అమావాస్య నాడు చెట్టు కొమ్మలను గని ,ఆకులను గని తుంచుట బ్రహ్మ హత్యతో సామానమయిన మహాపాపము.
[5].బోజన సమయంలో అన్నదేవత నోటి యందు వుంటుంది కాబట్టి ఆహారము మీదనే దృష్టి నిలిపి ,మౌనంగా బోజనము మీద గౌరవముతో ప్రీతిగా బుజించాలి .ఆ విధంగా తినే ఆహారం మాత్రమే వంటబట్టి దేహానికి శక్తినిస్తుంది.
[6].గడపను తోక్కకూడదు .గడప మీద నిలబడ కూడదు .గడపకు అటు ఒక కాలు ఇటు ఒక కాలు పెట్టి నిలబడి దానము చేయకూడదు.ఇలా చేసిన యెడల గడప ముందు నివాసముండే లక్ష్మి తొలిగి పోయి ఆ కుటుంబం అప్పులపాలగును.
[7].సూర్యునికన్న ముందు నిద్ర మేల్కొనే వారు సదా ఆరోగ్యం తో వర్ధిల్లుతారు .సూర్యోదయం తరువాత నిద్ర లేచే వారు ఎన్ని ఔషధాలు మింగినా ,అమృతమే తాగిన నిత్య రోగిష్టులవుతారు.
[8].ఎవరైనా తాము చేసే మంచి పనికి దానము చేయమని అడిగినపుడు తాను దానము చేయగలిగిన శక్తి గలవాడైతే మాపురమ్మని రేపు రమ్మని తిప్పుకోకుండా వెంటనే దానము చేయవలెను .ఈ దానం వల్ల అశ్వమేధ యాగా ఫలం సిద్ధిస్తుంది .ఎందుకనగా దానము పొందిన ఆ జీవుని ప్రసంనమే దేవుని ప్రసన్నమునకు కారణమవుతుంది.
[9].వ్రతం చేసే రోజున గానీ ,నోములు నోచె రోజు గాని ,ఏదైనా పవిత్రమైన ధైవకర్యం తలపెట్టిన రోజున గాని తన ముకమును అద్దములో చూసుకొన కూడదు.
[10].ఎవరి ఇంటి యందు 24 గంటలు దేవుని గది లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కలకాలం కాపురముంటుంది .అంతే కాకుండా పిత్రు దేవతలు పరమానందం చెంది తమ సంతానాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు .దీపం నువ్వుల నూనెతో గాని ,ఆవు నెయ్యితో గాని వెలిగించి వుండాలి(కరెంటు బల్బులు దీపంతో సమానం కావు).
[11].మనస్పూర్తిగా చేసిన దానము మాత్రమే మంచి ఫలితమునిచ్చును .కోపముతో గాని ,మొగమాటముతో గాని చేసిన దానము వలన పుణ్యము రాకపోగా పాపము సంక్రమించును.
[12].ఏడుస్తున్న పసిపిల్లలను తల్లి గాని ,తండ్రి గాని కొట్టినచో ఆ ఇరువురు నరకమున కు పోవుదురు.
[13].ఒక కాలుతో మరొక కాలును రుద్దుతూ తోముతూ కళ్ళు కడుక్కొన కూడదు .కింది పళ్ళను పై పళ్ళతో నొక్కి రాపిడి చేయకూడదు.
[14].భోజనం తరువాత వేళ్ళతో పండ్లు తోమకూడదు .పుక్కిలించి మాత్రమే ఊసివేయాలి.
[15].పండ్లతో గోళ్ళు కోరకకూడదు.2 చేతులతో ఒకే సారి నెత్తి గోక్కో కూడదు .
[16].నిద్రపోయే అప్పుడు ముకమును కూడా దుప్పటితో కప్పకూడదు . బోజనము చేసేటప్పుడు నోటితో శబ్దము చేయకూడదు .ఉదయం సాయంత్రం సంధ్యాసమయాల్లో నిద్ర పోకూడదు అంతకు మించి దరిద్రం మరొకటి లేదు.
[17].సంబోగం లో పాల్గోనినప్పుడు ధరించి ఉన్న బట్టలు ,ఉతికిన తరువాత కూడా వాటిని పూజా సమయంలో ధరిమ్పరాదు.
[18].మెదలపైనా ,గోడలపైన మంచం పైనా కూర్చొని చేసే జపము ,ధ్యానము ,నిరుపయోగము .బూమిపైన ధర్బాసనము గాని ,గొంగళి గాని ,పట్టు వస్త్రము గాని ,పులి చర్మము గాని పరచుకుని దానిపైన కూర్చుండి జపము చేయవలెను.
[19].ఆహారము బుజించే సమయంలో చేతిలోకి తీసుకున్న ముద్ద సగం నోటి లోకి పోయి మిగిలిన సగం మల్లి విస్తరలోకి పడకూడదు.
[20].బోజనానికి ముందుగానే ఎక్కువ నీరు తాగితే అజీర్ణం కలుగుతుంది.
[21].గణ పదార్దములు తినేటప్పుడు మధ్య మధ్య లో కొంచెం మంచి నీరు తాగాలి.
[22].మజ్జిగ అన్నం తిన్న తరువాత ఎక్కువ మంచి నీళ్ళు తాగితే కఫము పెరుగుతుంది.
[23].కొబ్బరి తిని గాని ,అరటి పండు తిని గాని ,తాంబూలం వేసుకుని గాని వెంటనే మంచి నీళ్ళు తాగకూడదు.
[24].భోజనం చేసేటపుడు జపము చేసేటపుడు శిరస్సును ముట్టుకోకూడదు.
[25].గారిక పోచాలతో దుర్గా మాతను ,మొగలి పూవులతో శివుని ,అక్షతలతో సాలాగ్రమమును ,తులసి తో వినాయకుని పొరపాటున కూడా పూజింపకూడదు.
[26].తులసి ఆకు ,పండ్లు ,పూలు ,పుస్తకము ,గారిక పోచలు ,ధర్బముడి ,పండితుల వ్రుష్టము ,శ్రీకుచములు ,రుద్రాక్షలు ,తులసి పూసలు వీటిని బూమి మోయలేదు.కాబట్టి వీటిని ఎప్పుడు బూమి మీద పెట్ట కూడదు.అనగా ఇవి నెలకు తగలకూడదు.
[27].చెక్క పీట మీద కూర్చుని చేసే జపం వల్ల దరిద్రం కలుగుతుంది.మేడి కర్ర పీత మీద కూర్చుని జపం చేస్తే సిద్ధిస్తుంది.
[28].వేప పుల్ల గాని మరే పుల్లనైన తోలు తీయకుండానే దంతధావనం చేయాలి.
[29].వెలగ కాయ పగటి పూట తిన కూడదు.వెలగ చెట్టు నీడ కూడా పగటి పూట పనికి రాదు.
[30].రావి చెట్టు నీడను రాత్రి పూట తొక్క కూడదు .రావి చెట్టును శనివారము తప్ప మిగిలిన రోజులలో ముట్టరాదు .తాటి చెట్టు నీడ ఎపుడు తొక్క కూడదు.
the above information gathered from INDIA AND AYURVEDHA blog .Thanks for them for providing such useful stuff